RSS

Tuesday, February 2, 2010

మానవత్వం మట్టిలో కలిసిపోయింది..............


ఓ చిన్నారి...........
మానవత్వం మట్టిలో కలిపి.....నిన్ను మంటల్లో వేసి
జగమెరుగని నిన్ను....కాటికి పంపించారు
బుజ్జి బుజ్జి మాటలతో....అందరిని నవ్వించాల్సిన నిన్ను
ఎవరికీ అందనంత ఎత్తుకి పంపించారు
నీ బందువులే...నీ పాలిట "రాబందువు"లయ్యారు
నిన్ను బలి తీసుకునే ముందు...ఆ దుర్మార్గులకు వాళ్ళ పసివాళ్ళు గురుతుకు రాలేకపోయారు
నిన్ను బలి తీసుకొని...ఈ సమాజం లో మానవత్వాన్ని చంపేసారు
నీకు-నాకు మధ్య ఎటువంటి సంబందము లేదు.......ఐన నీ మరణం నన్ను కలచివేసింది
నన్ను మాత్రమె కాదు....చిన్నరులంటే ఇష్టపడే ప్రతిఒక్కరి మనసును కలచివేసింది

2 మీ మనసులోని మాటలు:

Nrahamthulla said...

చిన్నారి వైష్ణవి కొలిమిలో మసైన తరువాత పరిశీలనలో తేలిన విషయాలుఃప్రకాశం బ్యారేజి, కనకదుర్గవారధి,కృష్ణానది ఎన్నో హత్యలకు మూగసాక్షులుగా ఉన్నాయి.
విజయవాడ నగర నేరగాళ్లు హత్యలు చేసి మృతదేహాలను తాడేపల్లిమండలం సీతానగరం లో పడవేస్తున్నారు.మహిళలను వంచించి, మోసగించి వారిని శారీరకంగా, ఆర్థికంగా దోచుకుని తాడేపల్లి ఏరియావైపు తీసుకువచ్చి దారుణంగా హతమారుస్తున్నారు.విజయవాడ-మంగళగిరి బైపాస్‌రోడ్డు వెంబడి మృతదేహాలను కాల్చివేస్తున్నారు.కృష్ణానది దాటించి కృష్ణాయపాలెం వద్ద మృతదేహాలను గోనెసంచిలో కుక్కి కొండవీటివాగులో గిరాటేసి వెళ్లిపోతున్నారు. కృష్ణానదిలో తేలియాడే శవాలను ఇటునుంచి అటు, అటు నుంచి ఇటు నెట్టివేసుకుంటూ తమ పరిధి కాదంటూ తప్పించుకుంటున్నారు.మంగళగిరి నుంచి కృష్ణాకెనాల్‌ జంక్షన్ వరకు హతుల మృతదేహాలను రాత్రివేళల్లో రైల్వేట్రాక్‌పై పడవేస్తున్నారు.కిడ్నాప్‌ చేసి తాడేపల్లి బకింగ్‌హామ్‌ కెనాల్‌ వద్ద వాహనాలు మార్చి తీసుకువెళుతున్నారు. తాడేపల్లిని కూడా విజయవాడ పోలీసు పరిధిలోకి తేవాలి.

Nrahamthulla said...

http://epaper.sakshi.com/Details.aspx?id=373788&boxid=28596068

Post a Comment

 
29501